న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.123 తగ్గి రూ.46,505కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,628 వద్ద ముగిసింది. అంతర్జాతీయం విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. ఇక వెండి ధరలు కూడా ఢిల్లీలో ఇవాళ స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.206 తగ్గి రూ.65,710కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 65,916 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో సైతం ఔన్స్ బంగారం ధర 1,795 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.16 అమెరికన్ డాలర్లు పలికింది.