న్యూఢిల్లీ : లక్నోలో చౌధరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇమిగ్రేషన్ ప్రాంతంలోని డస్ట్బిన్లో ఆరు బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ బార్స్ విలువ మార్కెట్లో రూ 36.60 లక్షలుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
బ్లాక్ పాలిథిన్ కవర్లో ఆరు గోల్డ్ బార్స్ను చుట్టి ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ ఏరియా వద్ద డస్ట్బిన్లో పడవేశారని అధికారులు తెలిపారు. డస్ట్బిన్లోకి గోల్డ్ బార్స్ ఎవరు తీసుకువచ్చి పడవేశారనేది గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గోల్డ్ బార్స్ను స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.