ముంబై: ఇండోనేషియాలోని మెడాన్ విమానాశ్రయ అభివృద్ధి కోసం అక్కడి అంగ్కాస పుర 2తో వాటాదారుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు మౌలిక రంగ దిగ్గజం జీఎమ్మార్ గ్రూప్ శుక్రవారం తెలియజేసింది. గత నెల ఇందుకు సంబంధించిన బిడ్ను జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ గెల్చుకోగా, గురువారం ఈ మేరకు షేర్హోల్డర్స్ అగ్రిమెంట్పై సంతకాలు జరిగాయి. 49:51 భాగస్వామ్య నిష్పత్తితో ఈ ఒప్పందాన్ని ఇరు సంస్థలు చేసుకున్నాయి. 2018లో ఈ విమానాశ్రయ ప్రయాణీకుల సంఖ్య కోటికిపైగానే ఉన్నది.