హైదరాబాద్, అక్టోబర్ 30: జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(జీఐఎల్) నష్టాలు మరింత తగ్గాయి. గడిచిన త్రైమాసికానికిగాను నష్టం రూ.190 కోట్లకు తగ్గినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నష్టం రూ.197 కోట్లుగా ఉన్నది. అయినప్పటికీ కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 25 శాతం ఎగబాకి రూ.1,285 కోట్ల నుంచి రూ.1,607 కోట్లకు ఎగబాకింది. మొత్తం ప్రయాణికుల 25 శాతం పెరిగి 2.65 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది. వీరిలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ద్వారా 1.77 కోట్ల మంది ప్రయాణించగా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 60 లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించింది.