హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): రోబోటిక్స్లో అత్యాధునిక మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించేందుకు హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని ఆలిండియా రోబోటిక్ అసోసియేషన్ (ఏఐఆర్ఏ) చైర్మన్ పీఎస్వీ కిషన్ తెలిపారు. ఏఐఆర్ఏ, తెలంగాణ ప్రభుత్వం కలిసి సంయుక్తంగా జూలై 21, 22 తేదీలలో ఈ సదస్సును నిర్వహించనున్నాయి.
ఈ కార్యక్రమానికి 25 దేశాల నుండి పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, ఇతర ఎకోసిస్టమ్ భాగస్వాములు హాజరు కానున్నారని కిషన్ వెల్లడించారు. ఏఐఆర్ఏ ఆధ్వర్యంలో ఏడాదిపాటు రోబోటిక్స్పై ఈవెంట్లను నిర్వహించనున్నామని, రోబోటిక్స్ అభివృద్ధి కోసం ఓ రోడ్ మ్యాప్పై చర్చించడానికి ఇది కలిసిరాగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. పరిశ్రమ నిపుణులతో ప్యానెల్ చర్చలు, ముఖ్యుల ప్రసంగాలతోపాటు, వివిధ రోబోట్లు, రోబోటిక్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్లపై ప్రదర్శన ఉంటుందని బుధవారం ఆయన తెలియజేశారు.