న్యూఢిల్లీ, ఆగస్టు 29: షేవింగ్, ఓరల్ క్లీనింగ్ ఉత్పత్తుల తయారీ సంస్థ జిల్లెట్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగాను సంస్థ రూ.91.75 కోట్లు పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.67.59 కోట్లతో పోలిస్తే ఇది 36 శాతం అధికం. అమ్మకాలు పెరగడం, ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం సంస్థకు కలిసొచ్చింది.
అలాగే సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.619.44 కోట్లకు చేరుకున్నది. క్రితం ఏడాది ఇది రూ.552.89 కోట్లుగా ఉన్నది. జూన్తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,477.05 కోట్ల ఆదాయంపై రూ.355.68 కోట్ల నికర లాభాన్ని గడించింది. సంస్థ జూలై నుంచి జూన్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా వ్యవహరిస్తున్నది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర రూ.5,519.15 వద్ద ముగిసింది.