న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా నెక్సస్ మాల్స్లో రిలయన్స్ జియో-బ్రిటీష్ పెట్రోలియం భాగస్వామ్యంతో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 13 నగరాల్లో 17 నెక్సస్ మాల్స్ ఉండగా, తొలి విడుత కింద ఈ నెలలోనే హైదరాబాద్తోపాటు నవీ ముంబై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ మాల్స్లో అందుబాటులోకి రానున్నాయి.
దీంతో ఇక నెక్సస్ మాల్స్లో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కార్లకు నిరంతరం చార్జింగ్ సదుపాయం ఉంటుందని ఓ ప్రకటనలో జియో-బీపీ తెలియజేశాయి. జియో-బీపీ కలిసి అటు ఈవీ తయారీదారులకు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా ఓ ఎకోసిస్టమ్ను రూపొందించాయి. గత ఏడాది దేశంలోనే రెండు అతిపెద్ద ఈవీ చార్జింగ్ హబ్లనూ నిర్మించిన విషయం తెలిసిందే.