హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బంగారు నగలు.. వెడ్డింగ్ జువెల్లరీకి నిలయంగా మానేపల్లి జువెల్లరీస్ ఖ్యాతిగాంచింది. మొట్టమొదటగా నగరంలో ప్రత్యేకమైన వజ్రాభరణాల నగలను కస్టమర్లకు అందిస్తూ.. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆభరణాలను తయారు చేయడంలో అత్యంత ప్రాచూర్యం పొందింది. ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులు కోరుకున్న తీరుగా వైవిధ్యమైన డిజైన్లతో వజ్రాభరణాలను తయారు చేసి ఇవ్వడంలో మానేపల్లికి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నది. జంటనగరాల్లో 6 బ్రాంచులను ఏర్పాటు చేసి విశ్వనగరవాసులకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను అందజేయడంలో ముందువరుసలో ఉన్నది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, వినియోగదారులు మొచ్చే విధంగా నగలను తయారు చేయడం మానేపల్లి ప్రత్యేకత. ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఆభరణాలు తయారు చేసి ఇవ్వండంతో పాటు వివిధ రకాల డిజైనర్ జువెల్లరీ రెడీగా ఇక్కడ లభిస్తున్నాయి. శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరించుకొని వినియోగదారుల కోసం 5 క్యారెట్ల వజ్రాభరణాల కొనుగోలుపై గోల్డ్ కాయిన్ను ఉచితంగా అందజేస్తున్నట్లు మానేపల్లి ప్రతినిధులు పేర్కొన్నారు.
వరలక్ష్మీ వ్రతం పండుగ సందర్భంగా మానేపల్లి జువెల్లరీస్లో గోల్డ్ డిజిటల్ యాప్ను ప్రవేశ పెట్టినట్టు వివరించారు. మొబైల్ ఫోన్ ఉంటే చాలు వినియోగదారులు కావాలసిన బంగారం నచ్చిన రీతిలో కొనుక్కునే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించారు. వివాహాది శుభకార్యాలకు ప్రతి వస్తువును అందిస్తున్న ఏకైక సంస్థ మానేపల్లి జువెల్లరీస్గా పేరుగాంచింది. నాణ్యత విషయంలో రాజీపడకుండా కస్టమర్ యొక్క అభిప్రాయాలను గౌరవిస్తున్నది. ప్రతి వస్తువుకు బీఐఎస్ హాల్మార్కు ద్వారా hyd నంబరింగ్తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలు సర్టిఫికెట్లు కలిగి ఉంటాయి. ఇందులో తయారయ్యే డిజైన్లు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎక్సిక్లూజివ్గా తయారు చేసి ఇవ్వడంలో ప్రత్యేకతను కలిగి ఉంది. డైమండ్స్ మరియు వజ్రాభరణాల కొనుగోలుపై 25 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరించుకొని ప్రకటించారు. అలాగే బంగారు ఆభరణాల తయారీపై ఫ్లాట్ 25 శాతం రాయితీని ప్రకటించినట్టు మానేపల్లి మేనేజింగ్ డైరక్టర్లు గోపికృష్ణ, మురళీకృష్ణ వెల్లడించారు.