న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: అదానీ గ్రూపు సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. అబుదాబీ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ) 2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అదానీ గ్రూపునకు సంబంధించిన మూడు గ్రీన్ సేవల కంపెనీలు.. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లోకి రూ.3,850 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్లోకి రూ.3,850 కోట్లు, అదానీ ఎంటర్ప్రైజెస్లోకి రూ.7,700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.