న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్ను (Flipkart Sale) నిర్వహిస్తోంది. సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 14 సిరీస్పై హాట్ డీల్స్తో పాటు, ఐఫోన్ 15పైనా ఆకర్షణీయ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. మొటొరొలా ఎడ్జ్ నియో 40, రెడ్మి 12 సిరీస్ సహా పలు 5జీ ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను ఈ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. వింటర్ సేల్ ఇప్పటికే ఫ్లిప్కార్ట్పై లైవ్లో ఉండగా డిసెంబర్ 31 వరకూ కొనసాగనుంది.
ఈ ఏడాదిలో ఫ్లిప్కార్ట్ వింటర్ ఫెస్ట్ చివరి సేల్ ఈవెంట్ కావడంతో న్యూ 5జీ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశంగా ముందుకొచ్చింది. ఐఫోన్ 14 ఈ సేల్లో రూ. 57,999కి లిస్టవగా, గత ఏడాది రూ. 89,900 ప్రారంభ ధరతో లాంఛ్ అయిన ఐఫోన్ 14 ప్లస్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్పై రూ. 65,999కి లభిస్తోంది.
ఐఫోన్ 14 ప్లస్పై ఫ్లిప్కార్ట్ ఏకంగా రూ. 23,901 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 15 కొనుగోలు చేయాలనుకునే వారు ఈ హాట్ డివైజ్ను ఫ్లిప్కార్ట్ సేల్లో రూ. 77,900కు దక్కించుకోవచ్చు. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫ్లిప్కార్ట్లో రూ. 11,990కే అందుబాటులో ఉంది. మొటొరోలా ఎడ్జ్ 40 నియో ఫ్లిప్కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్లో రూ. 22,999కే లభిస్తుండగా, వివో టీ2 5జీ రూ. 16,999కి అందుబాటులో ఉంది.
Read More :