న్యూఢిల్లీ, అక్టోబర్ 3: పండుగల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా ఆయా ప్రధాన మార్గాల్లో విమాన చార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. ఏకంగా 20-30 శాతం ఎగబాకడం గమనార్హం. ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో వివరాల ప్రకారం దుర్గాపూజ, దీపావళి సందర్భంగా ఏర్పడిన డిమాండ్ దృష్ట్యా విమాన టిక్కెట్ ధరలు 20-30 శాతం పెరిగినట్టు తేలింది. విమానయాన ఇంధన (ఏటీఎఫ్) ధరల్లో పెరుగుదల కూడా టిక్కెట్ రేట్ల పెంపునకు ఓ కారణంగానే పేర్కొన్నది. దేశవ్యాప్తంగా విమాన చార్జీలు భారీగా పెరిగిన మార్గాల్లో హైదరాబాద్ కూడా ఉన్నది. మిగతా టాప్-10 రూట్లలో పాట్నా, ముంబై, జైపూర్, అహ్మదాబాద్, వారణాసి, పుణె, గోవా, డెహ్రాడూన్, బగ్దోగ్రా నగరాలు ఉన్నాయి.