అక్టోబర్ నెలలో ఎగుమతులు 43 శాతం పుంజుకుని 35.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయినా వాణిజ్య లోటు 19.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దిగుమతులు కూడా 62.51 శాతం పెరిగి 55.37 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్రోలియం, కాఫీ, ఇంజినీరింగ్ గూడ్స్, నూలు, ఫ్యాబ్స్, జెమ్స్ అడ్ జ్యువెల్లరీ, కెమికల్స్ ప్లాస్టిక్, లినోలియం, సముద్ర ఉత్పత్తులను గత నెలలో ఎగుమతి చేయడంలో సానుకూల గ్రోత్ నమోదైందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఎగుమతులు 233.54 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతులు 55.13 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు దిగుమతులు 78.16 శాతం పెరిగి 3331.39 బిలియన్ డాలర్లకు చేరాయి.