ముంబై, ఫిబ్రవరి 27: ఫ్రెంచ్నకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా.. దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధమైంది. 2027లోనే భారత మార్కెట్లోకి ఈవీని విడుదల చేయాలనుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎన్యాక్ను ఈ ఏడాది భారత్లో పరిశీలించనున్నది. ఈ-మొబిలిటీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, వచ్చే మూడేండ్లకాలంలో ఆరు మాడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్రా జనెబా తెలిపారు. ఈవీని భారత్లో ఉన్న ప్లాంట్లో నే అసెంబ్లింగ్ చేయనున్నట్లు, 2027 నాటికి ఈ మాడల్ను తీర్చిదిద్ది విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.