M-Cap | ఫిబ్రవరిలో దేశీయ స్టాక్ మార్కెట్లలో కార్పొరేట్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గత వారంలో టాప్-10 కంపెనీలు రూ.3,33,307.62 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. ఈ నెలలో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,49,97,053.39 కోట్ల వద్ద స్థిర పడింది. గతేడాది జూలై నెలాఖరు నాటికి బీఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ రూ. 2,35,49,748.9 కోట్లు. గత నెలాఖరులో ఎం-క్యాప్ రూ. 2,64,41,207.18 కోట్ల వద్ద నిలిచింది.
ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించారు. దీంతో గతవారం ప్రారంభంలో సోమవారం రూ.2,57,39,712.95 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారానికి రూ. 2,42,24,179.79 కోట్లకు పడిపోయింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఎం-క్యాప్ రూ. 94,828.02 కోట్లు పతనమై రూ.15,45,044.14 కోట్ల వద్ద స్థిర పడింది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,01,760.91 కోట్లు పతనమై రూ.13,01,955.11 కోట్ల నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 31,597.65 కోట్లు నష్టపోయి రూ.8,06,931.95 కోట్ల వద్ద ముగిసింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 5,501.34 కోట్లు హరించుకుపోయి రూ.7,12,443.09 కోట్లకు చేరితే, ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 13,240.66 కోట్లు తగ్గి రూ.5,07,414.1 కోట్ల వద్ద నిలిచింది.
హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ. 6,929.03 కోట్లు తగ్గి రూ. 4,35,233.9 కోట్లకు పడిపోయింది. మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.33,234.97 కోట్ల నష్టంతో రూ. 5,09,990.53 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ ఎంక్యాప్ రూ.29,094.23 కోట్లు తగ్గి రూ.4,30,924.87 కోట్లకు, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,802.65 కోట్లు పతనమై రూ.4,20,653.95 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.13,318.16 కోట్లు నష్టపోయి రూ.3,78,098.62 కోట్లకు చేరుకున్నది.