హైదరాబాద్, జనవరి 3: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్కు మరో 50 బస్సుల ఆర్డర్ లభించింది. వీటి విలువ రూ.125 కోట్లు. ఫేమ్-2 స్కీం కింద ఓ రాష్ట్ర రవాణా సంస్థ నుంచి ఈ ఆర్డర్ లభించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. వచ్చే ఏడాదిలోగా ఈ బస్సులను సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంది.