హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఎడ్యుటెక్ సంస్థ నెక్ట్స్వేవ్ భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్(జీపీసీ) నుంచి 33 మిలియన్ డాలర్లు లేదా రూ.275 కోట్ల నిధులను సమీకరించినట్టు ప్రకటించింది. గతంలో పెట్టుబడులు పెట్టిన ఒరియస్ వెంచర్ కూడా తాజా పెట్టుబడుల్లో భాగస్వామి కావడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్, సీఈవో రాహుల్ అట్లూరి మాట్లాడుతూ..నూతన భాగస్వామి జీపీసీతో జట్టు కట్టడం చాలా సంతోషంగా ఉన్నదని, ఈ నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం వినియోగించనున్నట్టు చెప్పారు. దేశంలో ఆన్లైన్ ద్వారా ఉద్యోగ కల్పన సేవలు అందించే ఈ సంస్థను ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐఐటీ హైదరాబాద్లకు చెందిన విద్యార్థులు సం యుక్తంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సంస్థ 1,240కి పైగా సంస్థలకు ప్రతిభ కలిగిన ఉద్యోగులను అందించింది.