ఎల్లలులేని సమాజంగా ఇప్పుడు విద్యా ప్రపంచం మారిపోయింది. అందుకే విదేశాల్లో ఏ మూలన ఉన్న యూనివర్సిటీలోనైనా అడ్మిషన్ పొంది చదువుకునే రోజులు వచ్చేశాయి. అయితే విదేశీ విద్య అంత సులువైనదేం కాదు. మంచిగా చదువుకునే సామర్థ్యం, అద్భుతమైన ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ డబ్బు కూడా ముఖ్యమే మరి.
పడిపోతున్న రూపాయి విలువ, విపరీతంగా పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో విదేశాల్లో విద్య అత్యంత భారంగా తయారైంది. సాధారణంగా లోన్ తీసుకోకుండా విదేశాల్లో చదువుకోవడమనేది అందరికీ కుదిరే పనైతే కాదు. అయితే కొంతదాకా ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం పొందే మార్గం ఒకటుంది. ఇంతకీ అలా ఎంత రుణం పొందవచ్చు?.. లోన్ ఇచ్చే ముందు ఏయే అంశాలు చూస్తారు?.. ఎడ్యుకేషన్ లోన్ కంటే పర్సనల్ లోన్ మంచి ఆప్షన్ అవుతుందా?.. వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.
ఉన్నత చదువుల కోసం విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ సీం ఫర్ ఎడ్యుకేషన్ లోన్ సదుపాయాన్ని పరిచయం చేసింది. ఇందులోభాగంగా ఎలాంటి థర్డ్ పార్టీ గ్యారంటీ, పూచీకత్తు, హామీ లేకుండా విద్యా రుణం పొందే వీలుంటుంది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ మాడల్ ఎడ్యుకేషన్ లోన్ సీం కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే విద్యా రుణాలకు కేంద్రం హామీగా ఉంటుంది. ఆర్థికంగా బలహీన వర్గాలవారు (EWS) ఈ పథకం ద్వారా బ్యాంక్ రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బేస్రేటుపై గరిష్ఠంగా 2 శాతం వరకూ మాత్రమే అధికంగా వడ్డీరేటును ఈ రుణాలపై వసూలు చేస్తారు. ఈ సీం కింద గరిష్ఠంగా రూ.7.5 లక్షలదాకా విద్యా రుణాన్ని తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి సెక్యూరిటీ, కొల్లేటరల్, థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు. అయితే ఇంటర్మీడియట్ తర్వాత దేశీయంగానైనా, విదేశాల్లోనైనా ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో చేరుతున్నట్టు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ మాత్రం రుణదాతలకు సమర్పించాల్సి ఉంటుంది.
నిజానికి దేశ, విదేశాల్లోని బడా యూనివర్సిటీల్లో చదవడానికి ఈ రూ.7.5 లక్షలు ఏ మూలకూ సరిపోదు. అయితే మరింత రుణం పొందాలంటే మాత్రం పూచీకత్తు, థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం. ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విద్యార్థి మార్కులు, ఏ యూనివర్సిటీలో సీటు వచ్చింది, ఏ కోర్సులో చేరబోతున్నారు, డాక్యుమెంటేషన్ అంతా పకాగా ఉందా, క్రెడిట్ సోర్ ఎలా ఉంది, ఏ దేశానికి వెళ్తున్నారు అనే అంశాలను చాలా నిశితంగా పరిశీలిస్తాయి. ఎందుకంటే వీటి ఆధారంగానే రుణం మంజూరవుతుంది. బ్యాంక్ అధికారులు ముఖ్యంగా చూసేది ఏంటంటే.. ఇచ్చిన రుణ మొత్తం తిరిగి వస్తుందా?.. రాదా?.. అనేదే. పెద్దగా స్కోర్ లేకపోయినా మంచి మారులు, క్రమం తప్పకుండా అన్ని క్లాసుల్లో ఉండటం ముఖ్యమంటారు నిపుణులు. ఇంజినీరింగ్, మెడికల్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు కాస్త సులువుగా రుణాలు అందుతాయి. అమెరికా, బ్రిటన్ దేశాల్లోని టాప్ యూనివర్సిటీలకు కూడా తొలి ప్రాధాన్యత ఉంటుంది.
విద్యార్థికి మంచి అకడమిక్ రికార్డు ఉంటే విద్యా రుణాలు పొందడం మరీ అంత కష్టమేమీ కాదు. అలాగే తల్లిదండ్రులకు ఎంతోకొంత ఆస్తి, రుణం తీర్చగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు మంచి చదువు, హోదా కల్పించాలనే భావిస్తారు. అందుకోసం అప్పులకూ వెనుకాడరు. అయితే ఒకోసారి ఈ రుణభారం తల్లిదండ్రుల పాలిట గుదిబండలా మారవచ్చు. అలాంటి దుస్థితిని తెచ్చుకోవద్దు. అందుకే ఈఎంఐలు తిరిగి చెల్లించే స్థోమత ఉందా?.. లేదా?.. అనేదీ చూడాలి. పిల్లలకు మంచి ఉద్యోగం లభించేదాకా ఇబ్బంది లేకుండా ప్రణాళిక ఉండాలి.
– నాగేంద్ర సాయి కుందవరం
పిల్లల చదువు కోసం కొంతమంది తల్లిదండ్రులు వ్యక్తిగత రుణాలు తీసుకుంటుంటారు. కానీ ఇది మొదట్లో బాగానే అనిపించినా చాలా ఖరీదైన వ్యవహారమే. విద్యా రుణం 8.5-10.5 శాతం వడ్డీకి లభిస్తే.. వ్యక్తిగత రుణాలపై 12-18 శాతం మధ్య వడ్డీ ఉంటుంది. ఇక కోర్సు సమయం పూర్తయిన ఏడాదిదాకా కూడా విద్యా రుణాలపై మారటోరియం ఉంటుంది. కానీ పర్సనల్ లోన్ విషయంలో ఇలా ఉండదు. రుణం తీసుకున్న తర్వాతి నెల నుంచే వడ్డీ చెల్లించాలి. పైగా ఎడ్యుకేషన్ లోన్కు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలూ ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత రుణంపై ఆధారపడకపోవడమే ఎంతైనా లాభదాయకం.