హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ).. ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు అండగా నిలుస్తోంది. నగరంలో టీ-హబ్ తర్వాత స్టార్టప్లకు అత్యంత అనుకూలమైన కేంద్రంగా సీఐఈ ఇంక్యుబేటర్ నిలిచింది.
వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) ఆధ్వర్యంలో నిధి ప్రయాస్ నిర్వహిస్తున్నారు.
గత మూడేండ్లలో 25 స్టార్టప్లకు అవసరమైన ఆర్థిక సాయం అందించామని సీఐఈ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం 5వ విడత నిధి ప్రయాస్ కార్యక్రమానికి స్టార్టప్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆలోచన దశ నుంచి ప్రోటోటైప్గా, ఆ తర్వాత ఉత్పత్తిగా మార్చే లక్ష్యంతో నిధి ప్రయాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.