న్యూఢిల్లీ, జూన్ 19: కరోనా వైరస్తో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్ మోహపాత్ర మరణించారు. కరోనా వైరస్తో ఏప్రిల్లో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన..శనివారం ఉదయం మరణించారు. కొవిడ్-19తో మరణించిన తొలి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఆయనే. గురుప్రసాద్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ‘గురుప్రసాద్తో గుజరాత్, అటు కేంద్రంలోనూ కలిసి పనిచేశాను..ఒక విజన్ ఉన్న వ్యక్తి అని మోదీ ట్వీట్ చేశారు. ఈ విషయం షాక్కు గురి చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో పోస్ట్చేశారు. ఆయన మృతిపై పారిశ్రామిక, ఐటీ దిగ్గజాలు కూడా తమ సంతాపం వెలిబుచ్చారు.