ముంబై, ఆగస్టు 25: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడేలో భారీగా నష్టపోయిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు చివర్లో మదుపర్లను కొనుగోళ్ల వైపు పయనించాయి. గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం సూచీల్లో జోష్ పెంచింది.77,666 నుంచి 77126 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 286.98 పాయింట్లు లాభపడి 77,656.09 వద్ద ముగిసింది.
గత వారం రోజులకు పైగా తీవ్ర ఊగిసలాటలో కొనసాగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ తిరిగి లాభాల్లోకి రాగలిగింది. మార్కెట్ ముగిసే సమయానికి 115.50 పాయింట్లు అందుకొని 24,334.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇరాన్పై అమెరికా విధించిన షరతులు ఎంతగానో ఎదురుచూసిన ఆంక్షలు మార్కెట్ అంచనాలకు అందుకోలేకపోయాయి..దీని ఫలితంగా ముడి చమురు ధరలు, బాండ్ల రాబడులు వాటి ఇటీవల గరిష్ఠ స్థాయి నుంచి తగ్గుముఖం పట్టాయని జియోజిట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలి పారు.