Air Passengers | న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశీయ విమాన ప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. వార్షిక వృద్ధి 13 శాతంతో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి 15.4 కోట్లకు చేరుకోనున్నారని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. అలాగే దేశీయ విమానయాన సంస్థల నష్టాలు కూడా రూ.3-4 వేల కోట్లకు తగ్గొచ్చని వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరోనా కంటే ముందు స్థాయికి విమాన ప్రయాణికులు చేరుకోనున్నారని, 2019-20లో 14.2 కోట్ల మంది ప్రయాణించారని తెలిపింది.