హైదరాబాద్, అక్టోబర్ 1: ట్యాక్స్ పేయర్లతో సంబంధిత అధికారులు స్నేహపూర్వకంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఐటీ, జీఎస్టీ చెల్లింపుదారులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. దేశంలోని మెట్రో నగరాల్లో పర్యటిస్తూ ఐటీ, జీఎస్టీ, కస్టమ్స్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్.. శుక్రవారం హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఓ హోటల్లో సమావేశమవగా, ఇందులో తెలంగాణ, ఏపీకి చెందిన ఐటీ, జీఎస్టీ, కస్టమ్స్ ఉన్నత, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, సీబీడీటీ చైర్మన్ జేబీ మహాపాత్రలు కూడా పాల్గొన్నారు.