న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్, అమెజాన్, విజయ్ సేల్స్ వంటి పలు ఈకామర్స్ వెబ్సైట్లు రిపబ్లిక్ డే సేల్ను నిర్వహిస్తూ ప్రముఖ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నాయి. ఐఫోన్ 13, వన్ప్లస్ 10 ప్రొ, షియామి 12 ప్రొ వంటి ప్రీమియం ఫోన్లపై హాట్ డీల్స్ను ప్రకటించాయి. బ్యాంక్ కార్డ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఆయా ఆఫర్లతో కస్టమర్లు తమ డ్రీమ్ ఫోన్లను అతి తక్కువ ధరకు సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది.
ఐఫోన్ 13 స్మార్ట్ఫోన్ ధర రూ. 69,900 కాగా ఫ్లిప్కార్ట్పై రూ. 61,999 ప్రారంభ ధరకు లిస్టయింది.ఈ ఫోన్పై కస్టమర్లు ఏకంగా రూ. 7901 డిస్కౌంట్ పొందుతారు. ఇక ఐఫోన్ 14 ధర రూ. 79,900 కాగా ఫ్లిప్కార్ట్లో రూ. 66,999 ప్రారంభ ధరపై ఈ యాపిల్ హాట్ డివైజ్ లిస్టయింది. ఫ్లిప్కార్ట్పై నథింగ్ ఫోన్ 1ను ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా ఆఫర్పై కేవలం రూ. 26,499కే దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ భారత్లో రూ. 31,000కు మించిన ధరకు అందుబాటులో ఉంటుందని లాంఛ్ సందర్భంగా ప్రకటించారు.
ఇక మిడ్రేంజ్ 5జీ ఫోన్గా పేరొందిన రెడ్మి కే50ఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్ కాకుండానే రూ. 22,690కి కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. అమోల్డ్ డిస్ప్లే, 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన రియల్మి నార్జో 50 ప్రొ ఫ్లిప్కార్ట్ కస్టమర్లు ఆఫర్పై కేవలం రూ. 21,999కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్లో అతితక్కువ ధరకు విక్రయిస్తున్న పిక్సెల్ 6ఏ ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్లో రూ. 29,999కి లభిస్తోంది.