Crypto Bill | ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీలకు కేంద్ర ప్రభుత్వం నిర్వచనం ఇవ్వనున్నది. దీన్ని అసెట్గా మార్చాలని ప్రతిపాదించబోతున్నది. అంతేకాదు.. దీని నియంత్రణ బాధ్యతలను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అప్పగించడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
సెబీ వద్ద రిజిస్టర్ చేస్తున్న ప్లాట్ఫామ్లు, ఎక్స్చేంజీల్లోనే ఇన్వెస్టర్లు ఇక క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. సెబీ వద్ద సదరు ఎక్స్చేంజ్లు, ప్లాట్ఫామ్స్ల రిజిస్ట్రేషన్కు గడువును కూడా పెట్టనున్నదని తెలుస్తున్నది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే సర్కార్ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నదని ఆర్థికశాఖ ఉన్నతాధికారి చెప్పారు.
అక్రమ నగదు లావాదేవీల (మనీ లాండరింగ్) అరికట్టడానికి ఈ బిల్లులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) నిబంధనలనూ కూడా చేరుస్తారని సమాచారం. ఆర్బీఐ అధికారికంగా ప్రవేశపెట్టనున్న డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీలను విడదీస్తూ బిల్లులో ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్గా వర్గీకరించనున్నట్లు వినికిడి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన నిర్వాహకులపై రూ.5-20 కోట్ల వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించారని సమాచారం.