హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని, హరితహారం కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు దాదాపు 270 కోట్ల మొకలు నాటిందని తెలిపారు. ఇంధన వినియోగాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన పెర్ఫామ్-అచీవ్-ట్రేడ్ (పీఏటీ) సీంపై రెడ్కో హైదరాబాద్లో కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
పీఏటీ స్కీంను నిర్లక్ష్యం చేయకూడదని, నిర్దేశిత సమయంలో ఇంధన వినియోగ పత్రాలను అందజేయాలని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఏజీఎం అజయ్రాజ్ సూచించారు. ఇంధన పొదుపులో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేని పరిశ్రమలు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని, లక్ష్యాన్ని చేరుకున్న కంపెనీలకు ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లను అందజేస్తామని తెలిపారు.