న్యూఢిల్లీ, జనవరి 26: ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకా-కోలా.. స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లోకి ఓ స్మార్ట్ఫోన్నూ తీసుకురాబోతున్నది. ఓ పేరొందిన స్మార్ట్ఫోన్ తయారీ సంస్థతో కలిసి దీన్ని పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సదరు కంపెనీతో కోకా-కోలా పనిచేస్తున్నట్టూ చెప్తున్నారు. భారతీయ టిప్స్టర్ ముకుల్ శర్మ వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో ఈ ఫోన్ అందుబాటులోకి రావచ్చంటున్నారు. ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న ఫొటో ప్రకారం ఈ ఫోన్లో డ్యూయెల్ కెమెరా, కుడివైపున వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. ధర తదితర వివరాలేవీ ఇప్పటికైతే తెలియరాలేదు. అయినప్పటికీ రియల్మీ 10 4జీ ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ను కోకా-కోలా తేనున్నదని అంటున్నారు.