న్యూయార్క్ : జాబ్ కట్స్పై ఉద్యోగులకు సిటీ గ్రూప్ (City Group Layoffs) విస్పష్ట సంకేతాలు పంపింది. గ్రూప్లో తాను చేపట్టిన ప్రక్షాళనకు అనుగుణంగా వ్యవహరించాలని లేదంటే సంస్ధను వీడాలని 2,40,000 మంది బ్యాంక్ ఉద్యోగులను సిటీగ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేన్ ఫ్రేజర్ హెచ్చరించారు. జేన్ వార్నింగ్తో మరోసారి ఉద్యోగులను లేఆఫ్స్ భయం వెంటాడుతోంది. 15 ఏండ్లలో అతిపెద్ద పునర్వ్యవస్ధీకరణను ఆమె ప్రకటించిన కొద్దిరోజులకే ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతవారం జరిగిన టౌన్ హాల్ మీటింగ్లో జేన్ మాట్లాడుతూ ఉద్యోగులంతా అప్రమత్తం కావాలని, బ్యాంక్ కోసం మనం అత్యున్నత ఆశయాలతో ముందుకెళుతున్నామని, ఈ వేగవంతమైన ప్రయాణంలో త్వరితగతిన తమతో పయనించాలని ఆమె కోరారు. బ్యాంకు క్లైంట్స్ ఆర్డర్లను గెలుచుకునేందుకు, మార్పులను చేపట్టేందుకు తమతో కలిసి నడవాలని లేదంటే రైలు దిగి వెళ్లవచ్చని ఆమె ఉద్యోగులకు తేల్చిచెప్పారు.
2021లో జేన్ ఫ్రేజర్ అమెరికాలో మూడో అతిపెద్ద బ్యాంక్ హెడ్గా పగ్గాలు చేపట్టారు. బ్యాంకును అధిక లాభాల బాట పట్టిస్తానని, రిస్క్ లేకుండా చేస్తానని అప్పట్లో ఆమె ఇచ్చిన హామీని ఇప్పటివరకూ నిలుపుకోలేదు. మరోవైపు సిటీ గ్రూప్లో ఎంతమంది ఉద్యోగులపై వేటు వేస్తారనే వివరాలను జెన్ ఫ్రేజర్ ఆమె సహచరులు ఇంకా వెల్లడించలేదు. జాబ్ కట్స్, వ్యయ నియంత్రణ చర్యల పర్యవసానాలపై ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది.
Read More :