న్యూఢిల్లీ, నవంబర్ 1: పన్ను చెల్లింపుదార్లందరికీ సరళంగా ఉండేలా ఒకటే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారంను తీసుకురావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ప్రతిపాదించింది. టాక్స్పేయర్లందరూ కొత్త కామర్ ఐటీఆర్ ఫారంలో రిటర్నులు ఫైల్ చేసే ప్రతిపాదనపై భాగస్వామ్యపక్షాల వాఖ్యానాలను, సూచనలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఆహ్వానించింది. డిసెంబర్ 15కల్లా ఈ సూచనల్ని ఇవ్వాలని కోరిం ది. ప్రస్తుతం ఐటీ రిటర్న్ల కోసం ఏడు రకాల ఫారంలు ఉన్నాయి. వీటిలో చిన్న, మధ్య తరగతి పన్ను చెల్లింపుదార్లకు సరళమైనరీతిలో ఐటీఆర్ ఫారం1 (సహేజ్), ఫారం 4 (సుగమ్) అందుబాటులో ఉన్నాయి. వేతనం, ఒక గృహం/ఇతర మార్గాల్లో (వడ్డీ తదితరాలు) రూ.50 లక్షల వరకూ ఆదాయం కలిగిన వ్యక్తిగత టాక్స్పేయర్లు సహేజ్ ద్వారా ఫైల్ చేయవచ్చు.
వ్యాపారం, ప్రొఫెషనల్ సర్వీసుల ద్వారా రూ.50 లక్షల వరకూ ఆదాయం కలిగిన వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్లు) ఫారం-4లో రిటర్న్ సమర్పించవచ్చు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ ద్వారా ఆదాయం కలిగినవారు ఐటీఆర్-2, వ్యాపా రం, వృత్తుల ద్వారా లాభాల ఆదాయాన్ని పొందుతున్నవారు ఐటీఆర్-3 ఉపయోగించాలి. వ్యాపార సంస్థలు, ఎల్ఎల్పీల కోసం 5, 6 ఫారంలు, ట్రస్టులు రిటర్న్ వేయడానికి ఐటీఆర్-7 ఉద్దేశించినవి. కామన్ ఐటీఆర్ ఫారం ప్రవేశపెట్టినా, ఐటీఆర్-1, ఐటీఆర్-4లు కొనసాగుతాయని, వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు కామన్ ఫారం లేదా 1, 4 ఫారంలను ఎంపికచేసుకోవచ్చని సీబీడీటీ తెలిపింది.