హైదరాబాద్, నవంబర్ 8: సెలెక్ట్.. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ‘గ్రేట్ ఫెస్టివల్ డేస్’ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ వై గురు మాట్లాడుతూ..కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ‘స్కాన్ అండ్ విన్’ ప్రవేశపెట్టినట్టు చెప్పారు.
ఈ స్కాన్ అండ్ విన్ ద్వారా స్మార్ట్ఫోన్లపై 25 శాతం డిస్కౌంట్, ఎల్ఈడీ టీవీ కేవలం రూ. 999కే, బై వన్ గేట్ వన్ కాంబో ఆఫర్, యాక్ససరీస్పై ప్రత్యేక తగ్గింపు ధరకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఎల్ఈడీ టీవీ ధరలోనే క్యూలెడ్ టీవీని పొందే అవకాశాన్ని కల్పిస్తున్నది. అలాగే ఎంపిక చేసిన మొబైళ్లపై పలు బ్యాంకులు ఆఫర్లు అందిస్తున్నాయి. వీటితోపాటు రూ. 6,999కే ఎల్ఈడీ టీవీ, ఎల్ఈడీ టీవీ+సౌండ్ బార్తో ప్రత్యేక కాంబో, బ్రాండెడ్ స్మార్ట్వాచ్ని రూ.999 ప్రారంభ ధర, విద్యార్థులకు ల్యాప్టాప్, టాబ్స్ను తక్కువ ధరకే అందిస్తున్నది.