CBDT on Tax Refunds | ఏప్రిల్ నుంచి గత ఆగస్టు 30 వరకు సుమారు 24 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.67,401 కోట్లకు పైగా రీఫండ్ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. 22,61,918 మంది వ్యక్తులకు ఐటీ రిటర్న్స్ రూపంలో రూ.16,373 కోట్లు తిరిగి చెల్లించామని పేర్కొంది. 1,37,327 కేసుల్లో రూ.51,029 కోట్లు కార్పొరేట్ టాక్స్ రీఫండ్ చేశామని సీబీడీటీ ట్విట్ చేసింది.
ఇంతకుముందు ఆగస్టు 16 వరకు 22.75 లక్షల మందికి రూ.49,696 కోట్లు రీఫండ్ చేశామని తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఐటీ రిటర్న్స్కు సంబంధించి 21,50,668 కేసుల్లో రూ.14,608 కోట్లు, 1,24,732 కేసుల్లో రూ.35,088 కోట్ల కార్పొరేట్ టాక్స్ రీఫండ్ చేసినట్లు వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 23 వరకు రూ.51,531 కోట్లు రీఫండ్ చేశామని సీబీడీటీ పేర్కొన్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 93 శాతం రీఫండ్ క్లయిమ్స్ ప్రాసెస్ చేశామని వివరించింది. గత వారం పన్ను చెల్లింపు దారులకు పన్ను చెల్లింపుదారులకు రూ.15,269 కోట్లకు పైగా వారి ఖాతాల్లో జమ చేశామన్నది.