న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆన్లైన్లో కార్ల సేవలు అందిస్తున్న కార్స్ 24.. తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ -ఎన్సీఆర్, ముం బై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్లలో సొంతగా పునర్నిర్మాణ కేం ద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా యూస్డ్ కార్ల వినిమయం ఊపందుకోవడం వల్లనే ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.