NR Narayana Murthy | దేశంలో దారిద్ర్య నిర్మూలన సమస్య పరిష్కారానికి ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి కీలక పరిష్కారం ప్రకటించారు. భారత్ సహా ఏ దేశంలోనైనా పెట్టుబడి దారి వ్యవస్థ ఆధారిత జంట స్తంభాలు – స్వేచ్ఛా మార్కెట్ (Free Market), ఎంటర్ప్రెన్యూర్షిప్- వ్యాపారవేత్తల (Entrepreneurship)తోనే పరిష్కారం అని చెప్పారు. ప్రముఖ బ్రోకరేజీ ప్లాట్ ఫామ్ జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ ఆధ్వర్యంలో బెంగళూరు టెక్ సమ్మిట్ సందర్భంగా నిర్వహించిన చర్చాగోష్టిలో ఎన్ఆర్ నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ప్రభుత్వం పారదర్శక, స్వేచ్ఛాయుత నియంత్రణ వ్యవస్థగా ఉండాలి. భారత్ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తమ సంస్థల నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉండాలి. పారదర్శకత పాటించాలి. ఫెయిర్నెస్తో కూడిన లావాదేవీలు నిర్వహించినప్పుడే స్వేచ్ఛాయుత మార్కెట్ సాధ్యం అవుతుంది` అని ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. కన్ఫ్యూజ్డ్ కమ్యూనిస్టుల నుంచి పరివర్తన చెందానన్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ ప్రచారకులు, పౌరులు అధిక పన్నులు చెల్లించాలి. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక పన్నులు ఎక్కువగా విధించాలని అన్నారు.