ముంబై, మార్చి 29: ఒమన్ నుంచి క్రాస్-బార్డర్ ఇన్బౌండ్ బిల్ చెల్లింపుల ప్రక్రియకు ఎన్పీసీఐ భారత్ బిల్పేతో కెనరా బ్యాంక్ జట్టు కట్టింది. తద్వారా దేశంలో ఈ ఒప్పందం చేసుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా రికార్డులకెక్కింది. గత ఏడాది ఆర్బీఐ..
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా రుపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్ కింద క్రాస్-బార్డర్ ఇన్బౌండ్ బిల్పేమెంట్స్కు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రవాస భారతీయుల కోసం బీబీపీఎస్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు కెనరా బ్యాంక్ తెలిపింది. దీంతో ఒమన్ నుంచే ఇకపై భారత్లో తమ పురపాలక పన్నులు, స్కూల్ ఫీజులు, ఇతర యుటిలిటీ బిల్లుల చెల్లింపులను అక్కడి ఎన్నారైలు చేసుకోవచ్చని బ్యాంక్ వెల్లడించింది.