ముంబై, జూన్ 16 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేకంగా డిపాజిట్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బీవోబీ గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్’పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ 555 రోజుల కాలపరిమితితో 7.40 శాతం వరకు వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది.
దీంట్లో సాధారణ ప్రజలకు 6.75 శాతం వడ్డీని చెల్లించనున్న బ్యాంక్..సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం, నాన్-కాలబుల్ డిపాజిట్లపై 7.40 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ వర్తించనున్నదని బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వాహెద్ తెలిపారు.