Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కీలక నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ డిజిల్ లెండింగ్ బిజినెస్ హెడ్ అఖిల్ హండాకు ఉద్వాసన పలికింది. శనివారం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ దేబదత్తా చంద్ ఈ సంగతి చెప్పారు.
‘బీవోబీ వరల్డ్’ యాప్ నిర్వహణలో పర్యవేక్షణా లోపాలు ఉన్నాయని, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ అందులో కొత్త సబ్స్క్రైబర్లను చేర్చవద్దని గత నెల 10న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)ని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆదేశించింది. ఆర్బీఐ రెగ్యులేటరీ చర్యల నేపథ్యంలో అఖిల్ హండాకు ఉద్వాసన పలుకుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఆర్బీఐ నియంత్రణ చర్యలు ప్రకటించిన వెంటనే ‘బీవోబీ వరల్డ్’ యాప్ నిర్వహణలో ఉన్న కొద్ది మంది అధికారులను కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా సస్పెండ్ చేసింది. కానీ ఆర్బీఐ ఆదేశాల వల్ల బీవోబీ వరల్డ్ యాప్ పై గణనీయ ప్రభావమేమీ పడలేదని పేర్కొంది. ఆర్బీఐతో నిత్యం సంప్రదిస్తున్నామని, పూర్తి వివరాలు వెల్లడించలేమని వెల్లడించింది. బీవోబీ వరల్డ్ యాప్ పై నిషేధం ఎత్తేయడానికి నిర్దిష్ట కాల పరిమితి లేదని తెలిపింది.