హైదరాబాద్, జూలై 22: టెక్నాలజీ సంస్థ తాన్లా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. జూన్లో ముగిసిన త్రైమాసికంలో సంస్థరూ.104.48 కోట్ల నికర లాభాన్ని గడించింది. కంపెనీ చరిత్రలో ఇంతటి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 33 శాతం అధికమని కంపెనీ చైర్మన్, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 38 శాతం అధికమై రూ.626.38 కోట్లు ఆర్జించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.717.11 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు రూ.65 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో షేరు ధర రూ.1,260గా నిర్ణయించింది.