న్యూఢిల్లీ, జనవరి 26: టెక్నాలజీ సేవల సంస్థ బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమైంది. షేరు ధరల శ్రేణిని రూ.129-135 మధ్యలో నిర్ణయించింది. ఈ నెల 30న ప్రారంభంకానున్న ఈ వాటాల విక్రయం..ఫిబ్రవరి 1న ముగియనున్నదని తెలిపింది. 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించనున్నది. యాంక ర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 29న నిర్వహించనున్నది. పెట్టుబడిదారులు కనీసంగా 108 ఈక్విటీ షేర్లకు బిడ్డింగ్ దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.