న్యూఢిల్లీ, జనవరి 27: ఫ్లిప్కార్ట్ బోర్డు నుంచి వైదొలిగారు బిన్నీ బన్సల్. ఈ నెల మొదట్లో ఈ-కామర్స్ స్టార్టప్ ఒప్డోర్ను ప్రారంభించిన నేపథ్యంలో ఇతర సంస్థల్లో బోర్డులకు రాజీనామా చేస్తున్నారు. సచిన్ బన్సల్తో కలిసి బిన్నీ బన్సల్ 2007లో బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్కార్ట్ను ప్రారంభించారు. ఫ్లిప్కార్ట్ను వాల్మార్ట్ హస్తగతం చేసుకున్ననాటి నుంచి ఒక్కోక్కరు సంస్థను వీడుతున్నారు. ఇప్పటికే సచిన్ బన్సల్ తన పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.