Bill Gates | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్..హైదరాబాద్లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన పలువురు ఇంజినీర్లు, మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గేట్స్ మాట్లాడుతూ..కృత్రిమ మేధస్సు పవర్గా భారత్ మారబోయే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. 1998లో హైదరాబాద్లో సంస్థ ఐడీసీ సెంటర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇటీవల 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ సెంటర్లో పరిశోధన, ఇంజినీరింగ్, డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఏఐ అప్లికేషన్స్లో ప్రపంచస్థాయి ఉత్పత్తులను మార్కెట్కు అందించిందని కుమార్ తెలిపారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల కూడా కృత్రిమ మేధస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో 75 వేల మంది మహిళా డెవలపర్లకు ఏఐలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు కూడా.