హైదరాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ): బయోటెక్నాలజీ రంగం అభివృద్ధికి చేసిన విశేష కృషికిగాను బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్లకి డాక్టర్. బీఎస్ బజాజ్ స్మారక ప్రత్యేక అవార్డు-2022ను ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఎఫ్ఏబీఏ) ప్రకటించింది. అలాగే ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను ఎఫ్ఏబీఏ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికచేశారు. కోవిడ్-19కి నివారణకు సంబంధించి బయోలాజికల్ ఈ ఆధ్వర్యంలో కార్బెవాక్స్ వ్యాక్సిన్ను రూపొందించినందుకుగాను ఎండీ మహిదా దాట్లను, ఐసీఎంఆర్ సలహాదారుగా ఆల్ ఇండియా బయోటెక్ అసోసియేషన్స్, ఎఫ్ఏబీఏకు అందించిన విశేష సహకారానికిగాను బీపీ ఆచార్యను అవార్డులకు ఎంపికచేసినట్లు ఎఫ్ఏబీఏ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రెడ్డన్న తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్ఏబీఏ ఆధ్వర్యంలో ఈ నెల 24,25 తేదీల్లో నిర్వహించే ఆసియాలోని అతిపెద్ద బయో ఏషియా 19ఎడిషన్ సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.