న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్ను విడుదల చేసింది బగాస్ ఆటో లిమిటెడ్. తన ఫ్లాగ్షిప్ ఈవీ మాడల్ ‘సీ12’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విడుదల సందర్భంగా ఈ స్కూటర్ ధరను రూ.97,999గా నిర్ణయించింది. రెగ్యులర్ ధర రూ.1,04,999. ముందస్తుగా రూ.999 చెల్లించి ఈ స్కూటర్ను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
పుణెలో ఉన్న ఆర్అండ్డీ లోనే తయారైన ఈ స్కూటర్ దేశీయ విడిభాగాలతో తీర్చిదిద్దినట్టు కంపెనీ ఫౌండర్, ఎండీ హేమంత్ కాబ్రా తెలిపారు. ఒక్కసారి బ్యాటరీ రీచార్జితో 143 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా 100 షోరూంలు ఉన్నాయి.