న్యూఢిల్లీ, ఆగస్టు 23: యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు మరింత పెరగనున్నది.
దీంతో ఒక్కరోజు, నెల రోజుల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.85 శాతానికి చేరుకున్నది. పెంచకముందు ఇది 7.80 శాతంగా ఉండేది. రిజర్వుబ్యాంక్ రెపోరేటును అర శాతం పెంచిన రెండు వారాల తర్వాత యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం విశేషం.