మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం (MSSC) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేవలం రెండేండ్ల కోసం, అది కూడా గరిష్ఠంగా రూ.2 లక్షలకు మాత్రమే వర్తించే ఈ స్కీం.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ స్కీం ఉద్దేశం ఏమిటి?, ఎవరికి ఉపయుక్తంగా ఉంటుంది?, వచ్చే రాబడిపై పన్ను చెల్లించాలా?.. వంటి అనేక సందేహాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానమే ఇది.
ఏమిటీ సీం ప్రత్యేకత?
మహిళల్లో కూడా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. బీరువాల్లో, బియ్యం డబ్బాల్లో దాచుకునే డబ్బును బయటకి తీసుకురావడంతోపాటు మహిళల్లో కూడా ఇన్వెస్ట్మెంట్పై అవగాహన పెంచేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలోకి వారిని పూర్తిస్థాయిలో భాగం చేసేందుకు ఈ కొత్త సీంను ప్రకటించారు. అయితే ఏప్రిల్ 1, 2023తో మొదలై మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండబోతోంది ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం.
ఎకడ?, ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
ప్రస్తుతం పోస్టాఫీసులు, కొన్ని ఆథరైజ్డ్ బ్యాంకుల్లో మాత్రమే ఈ సేవింగ్స్ సీంను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీ సమీప పోస్టాఫీసుకు వెళ్లి కేవైసీ (నో యువర్ క్లయింట్) డాక్యుమెంట్లను సమర్పించాలి. ఆధార్, పాన్ కార్డుతోపాటు అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఇవ్వాలి. నగదు లేదా చెక్ కూడా ఇవ్వవచ్చు.
రూ.2 లక్షలు పెడితే.. ఎంతొస్తుంది?
ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సీంకు 7.5 శాతం వడ్డీ వస్తోంది. ఉదాహరణకు మనం రూ.2 లక్షలను పెట్టుబడిగా పెట్టి మెచ్యూరిటీ సమయం వరకూ వేచి ఉంటే చివరకు వచ్చే మొత్తం రూ.2.32 లక్షలు. లక్ష రూపాయలు పెట్టుబడిగా పెడితే రెండేండ్ల తర్వాత వచ్చే మెచ్యూరిటీ మొత్తం సుమారు రూ.1.16 లక్షలు. వడ్డీ మొత్తాన్ని మూడు నెలలకోసారి మన ఖాతాల్లో జమ చేస్తారు.
సెక్షన్ 80సీ వర్తిస్తుందా?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం ఈ సీంకు రిబేట్ వర్తించదు. అంటే ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల అదనంగా మనకు ఎలాంటి రాయితీ లభించదు. పోస్టాఫీస్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ సీంలు, కిసాన్ వికాస్ పత్ర మాదిరి వీటికి పన్ను రాయితీ ఏమీ ఉండదు. అంతేకాదు ఈ పథకం కింద వచ్చే లాభంపై పన్ను కూడా ఉంటుంది. మన ట్యాక్స్ శ్లాబుల ఆధారంగా టీడీఎస్ కూడా డిడక్ట్ చేస్తారు.
ఎవరికి లాభం?
ఇప్పుడు బ్యాంకులు కనిష్ఠంగా 5.5 శాతం, గరిష్ఠంగా 7 శాతం వరకూ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని చెల్లిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు మరో పావు శాతం నుంచి అర శాతం అధికంగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ లెకన చూసుకున్నా మనకు ఈ సీం ద్వారా అర శాతం నుంచి ఒక శాతం వరకూ వడ్డీ ప్రయోజనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సీం కాబట్టి మన పెట్టుబడికి పూర్తి భరోసా లభిస్తుంది. బ్యాంకుల్లోని సేవింగ్స్ సీంలలో డబ్బులు పెట్టుకునేవాళ్లు, భౌతికంగా నగదును దాచుకునే మహిళలు ఈ సీంను పరిశీలించవచ్చు. విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు ఈ సీంపై అవగాహన పెంచుకుని పెట్టుబడి పెట్టవచ్చు. సీనియర్ సిటిజన్లకు మాత్రం ఇదేమీ అంత ఎగె్జైటింగ్ ఆఫర్ కాదు. ఎందుకంటే ఈ మాత్రం వడ్డీ మన సమీపంలోని కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా దొరుకుతున్నది మరి. ఇక రూ.2 లక్షల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని అనుకున్నప్పుడు ఒకేసారి కాకుండా వీలైతే రెండు భాగాలుగా అంటే లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా అత్యవసరం వస్తే ఒక బాండ్ను ఉపసంహరించుకుంటే సరిపోతుంది.
మధ్యలో నగదు అవసరమైతే ఎలా?
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సీంలో పెట్టుబడి పెట్టిన తర్వాత మధ్యలో మనకు నగదు అవసరమైతే ఎలా? అనే అనుమానం మనలో ఉండొచ్చు. అయితే ఇందులో కొన్ని వెసులుబాట్లున్నాయి. ఇన్వెస్ట్ చేసిన 6 నెలల తర్వాత మనం పెట్టిన సొమ్ములో 40 శాతం వరకూ ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. అంటే రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే గరిష్ఠంగా రూ.40 వేల మొత్తాన్ని 6 నెలల తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఇలా మధ్యలో విత్డ్రా చేసుకుంటే వడ్డీరేటులో 2 శాతం కోత విధిస్తారు. అలా కాకుండా పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ మరణించినా.. లేదా తీవ్ర అనారోగ్యం పాలైనా కూడా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ప్రీ-మెచ్యూర్డ్ క్లోజింగ్కు నిర్దిష్టమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. పైన చెప్పిన కారణాలతో అర్ధాంతరంగా క్లోజ్చేసే డిపాజిట్లకు అప్పటివరకూ జమ అయిన వడ్డీ, అసలు చెల్లిస్తారు. అనారోగ్యం, అత్యవసరం, మరణం వంటి కారణాలు కాకుండా ప్రీ-మెచ్యూర్డ్ అకౌంట్ క్లోజింగ్ సర్టిఫికెట్లపై మాత్రం వడ్డీ కోత ఉంటుంది.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
కనిష్ఠంగా రూ.1,000తో మొదలుపెట్టి.. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకూ ఈ సీంలో పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉన్నది. మొత్తం ఒకేసారి చెల్లించకపోయినా మన దగ్గర వీలున్నప్పుడు కొద్ది మొత్తాల్లో (రూ.1,000కి మించి మాత్రమే) కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఒక సర్టిఫికెట్కు, మరో సర్టిఫికెట్కు మధ్య కనీసం 3 నెలల గడువుండాలనే నిబంధన ఉన్న నేపథ్యంలో ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంకోసారి మరో మొత్తం పెట్టుబడి పెట్టాలంటే 3 నెలలు ఆగాల్సిందే. ఇలా ఎన్నిసార్లు ఈ పథకంలో పెట్టుబడి పెట్టినా గరిష్ఠ మొత్తం మాత్రం రూ.2 లక్షలు మించే అవకాశం లేదు.
-నాగేంద్ర సాయి కుందవరం