హైదరాబాద్, ఫిబ్రవరి 20: ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ ఆసుస్ ఇండియా..గేమర్ల కోసం హైదరాబాద్లో రెండో రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్(ఆర్వోజీ) స్టోర్ను ప్రారంభించింది. 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో కంపెనీకి చెందిన ఉత్పత్తులు నోట్బుక్స్, ఆర్వోజీ పీసీలు, ల్యాప్టాప్లు, ఆల్-ఇన్-వన్ పీసీలు, యాక్సెససీరిస్లను డిస్ప్లే చేసింది. దేశవ్యాప్తంగా గేమింగ్లు ఆడేవారి సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వీరికోసం ప్రత్యేకంగా జోన్ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో హైదరాబాద్లో సంస్థ ఏర్పాటు చేసిన నాలుగో సెంటర్ ఇదని కంపెనీ నేషనల్ సేల్స్ మేనేజర్ జిగ్నేష్ భావ్సర్ తెలిపారు. మెట్రో నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు, ఇందుకోసం టచ్పాయింట్లను సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.