న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ సేవల సంస్థ ఆర్మీ ఇన్ఫోటెక్కు బోండాడ ఇంజినీరింగ్ నుంచి రూ.740.97 కోట్ల విలువైన ఆర్డర్లు లభించింది. జీఎస్టీతో కలుపుకొని రూ.375.18 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను బ్లాక్-1(300 మెగావాట్ల ఏసీ) కోసం రాగా, మరో రూ.364.79 కోట్ల కాంట్రాక్ బ్లాక్-3(300 మెగావాట్ల ఏసీ)ని పొందినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇందుకు సంబంధించి ఆర్మీ ఇన్ఫోటెక్..బోండాడ నుంచి రెండు లెటర్స్ ఆఫ్ అవార్డు అందుకున్నది. ఈ రెండు ఆర్డర్లలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్కు ఏసీలను సరఫరా చేయడంతోపాటు మూడేండ్లపాటు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ చేయాల్సివుంటుంది.