BharatPe | ఫిన్టెక్ స్టార్టప్ సంస్థల్లో ఒకటిగా ఉన్న భారత్పే ఇబ్బందుల్లో కూరుకున్నది. భారత్పే సహా-వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ-సీఈవో అశ్నీర్ గ్రోవర్ వైదొలిగిన కొన్ని నెలల తర్వాత సంస్థ మరో సహా-వ్యవస్థాపకుడు భావిక్ కొలాదియా వైదొలిగారు. భారత్పే సంస్థను టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయడంలో కొలాదియా కీలక పాత్ర పోషించారు.
అశ్నీర్ గ్రోవర్ తర్వాత కొలాదియా నిష్క్రమించడంతో భారత్పేలో కీలకం కానున్నది. నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలతో అశ్నీర్ గ్రోవర్.. భారత్ పే నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. భారత్పే ఇండిపెండెంట్ కన్సల్టెంట్గా సంస్థలో టెక్నాలజీ, ప్రొడక్ట్ డివిజన్లకు మార్గదర్శిగా నిలిచారు.
జూలై 31న భారత్పేలో కొలాదియా పదవీ కాలం ముగిసిందని ఆ సంస్థ తెలిపింది. సొంతంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారని పేర్కొంది. తాను పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో భారత్పే ఒకటి అని భావిక్ కొలాదియా చెప్పారు. భవిష్యత్లోనూ భారత్పేలో పెట్టుబడులు కొనసాగిస్తానని తెలిపారు.