న్యూఢిల్లీ : అంతర్జాతీయ కాఫీ దిగ్గజం స్టార్బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియామకం పట్ల పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఐకానిక్ కంపెనీలకు భారత సంతతి సీఈవోల నియామకం అన్స్టాపబుల్ ట్రెండ్గా మారిందని ఆయన ట్వీట్ చేశారు. అంతర్జాతీయ బోర్డురూమ్లు భారత సంతతి సీఈవోలను సురక్షిత నేతల ఎంపికగా భావిస్తున్నాయని, భారత సంతతి సీఈవోల నియామకం సునామీలా సాగుతూ అన్స్టాపబుల్ ట్రెండ్గా మారిందని ట్వీట్లో పేర్కొన్నారు.
ఆనంద్ మహింద్ర పోస్ట్పై పలువురు యూజర్లు కామెంట్స్ చేశారు. టెక్ కంపెనీ సీఈవో, సీవోవోగా భారత సంతతి వ్యక్తిని ఎంచుకోవడం వ్యూహాత్మక వ్యాపార ఎత్తుగడగా కొందరు యూజర్లు పేర్కొన్నగా, రాబోయే రోజుల్లో మీతో కలిసి పనిచేసేందుకు వేచిచూస్తున్నానని మరో యూజర్ రాసుకొచ్చారు. ఇక రెకిట్ సీఈవోగా లక్ష్మణ్ నారాయణన్ (55) పనిచేస్తున్నారు.
గతంలో ఆయన పెప్సికో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా సేవలందించారు. హోవర్డ్ స్కల్జ్ స్ధానంలో స్టార్బక్స్ సీఈవో బాధ్యతలను చేపట్టనున్న లక్ష్మణ్ నారాయణన్ అక్టోబర్ 1న కంపెనీలో చేరనున్నారు. ఇక 2023 ఏప్రిల్ నుంచి లక్ష్మణ్ నారాయణన్ సీఈవో పగ్గాలను స్వీకరిస్తారని స్టార్బక్స్ వెల్లడించింది.