న్యూఢిల్లీ, అక్టోబర్ 12: స్టీల్ ఉత్పత్తి సంస్థ ఏపీఎల్ అపోలో..బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను ప్రచారకర్తగా నియమించుకున్నది. మూడు దశాబ్దాలకు పైగా మేక్ ఇన్ ఇండియా మంత్రాన్ని జపిస్తున్న సంస్థ..వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, బ్రాండ్కు మరింత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో బాలీవుడ్ బాద్షాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్టు కంపెనీ చైర్మన్, ఎండీ సంజయ్ గుప్తా తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న సంస్థకు దేశవ్యాప్తంగా 11 స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లు ఉండగా, వీటితో ప్రతియేటా 36 లక్షల టన్ను స్టీల్ను ఉత్పత్తి చేస్తున్నది.