కోయంబత్తూర్, జూలై 8: ఈ నెల 26, 27 తేదీల్లో తమ వార్షిక ప్రైమ్ డే సేల్ను నిర్వహించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గురువారం ప్రకటించింది. సామ్సంగ్, షియా మీ, ఇంటెల్, అడిడాస్ తదితర సంస్థ ల నుంచి 300లకుపైగా కొత్త ఉత్పత్తులు ప్రైమ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. లక్షలాది చిరు వ్యాపారులూ ఇందులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నది.