న్యూఢిల్లీ : ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్ను నవంబర 26 నుంచి పెంచనున్నట్టు ప్రకటించింది. యూజర్ నుంచి సగటు రాబడి (ఏఆర్పీయూ)ని మెరుగుపరిచేందుకు టారిఫ్ పెంపును చేపట్టామని ఎయిర్టెల్ వెల్లడించింది. ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్, జియో సైతం త్వరలో తమ టారిఫ్లను పెంచవచ్చని భావిస్తున్నారు. ఎయిర్టెల్ టారిఫ్ పెంపుతో కస్టమర్లు నవంబర్ 26లోగా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ లేదా పలు ప్రయోజనాలతో కూడిన యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఎంచుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
1.5జీబీ, 2జీబీ డైలీ డేటా ప్లాన్స్ వాడేవారు తక్కువ ధరకు లభించే ఎయిర్టెల్ యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్లకు మారడం మేలు. రూ 1498 యాన్యువల్ ప్లాన్ను ఆఫర్ చేస్తున్న ఎయిర్టెల్ ఈ ప్లాన్ను రూ 1799కి పెరగనుంది. ఈ ప్లాన్లో 24జీబీ డేడా రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిడెట్ కాలింగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక రూ 2498 యాన్యువల్ ప్లాన్లో 2జీబీ డైలీ డేటా, అన్లిమిడెట్ కాల్స్ 365 రోజుల వ్యాలిడిటీ అందుబాటులో ఉండగా ఈ ప్లాన్ రూ 500 భారం కానుంది. ఇక ఎయిర్టెల్ ప్రస్తుతం అందిస్తున్న రూ 2698 ప్లాన్లో 2జీబీ డైలీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 365 రోజుల వ్యాలిడిటీతో పాటు డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ సబ్స్ర్కిప్షన్ లభిస్తుంది.